England vs India Women’s Test: Sneh Rana becomes first Indian to score half-century and take 4-wicket haul on debut<br />#SnehRana<br />#TaniyaBhatia<br />#EngVsind<br />#Indvseng<br />#Sehwag<br />#WTCFinal<br /><br />ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా ఆడాల్సిన స్థితిలో భారత మహిళా క్రికెటర్లు అద్భుత పోరాటపటిమ కనబరిచారు. ఫాలో ఆన్ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీమిండియాను అరంగేట్రం ఆల్రౌండర్ స్నేహ్ రాణా (154 బంతుల్లో 13 ఫోర్లతో 80 నాటౌట్), తానియా భాటియా (88 బంతుల్లో 6 ఫోర్లతో 44 నాటౌట్) శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. వీరికి అండగా టెయిలండర్ శిఖా పాండే (50 బంతుల్లో 3 ఫోర్లతో 18)పోరాడింది.దాంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
